సంబంధిత వార్తలు
- అమేజాన్లో కేజీఎఫ్... ట్రోలింగ్ మామూలుగా లేదు... డోకు వస్తోంది...
- ఫేస్బుక్ను నెల రోజులు వాడకుండా వుంటే.. ఏం జరుగుతుందో తెలుసా?
- జియో ఫోన్ యూజర్లకు మరో గిఫ్ట్... జియో రైల్ యాప్తో టిక్కెట్స్ బుక్...
- మోహన్లాల్పై ట్రోలింగ్.. బూట్లు.. నా.. తెచ్చుకున్నారా?
- ఓలా క్యాబ్లో ప్రయాణించండి... 15 రోజుల తర్వాత చెల్లించండి...
ఫేస్బుక్లో సరికొత్త ఫీచర్... ఏంటది?
సోషల్ మీడియా ప్రసార సాధనాల్లో ఒకటైన ఫేస్బుక్ ఇపుడు సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ యూజర్లందరూ వినియోగించుకోవచ్చు. నిజానికి గత కొన్ని రోజుల క్రితం ఈ ఫీచర్ను ప్రవేశపెట్టింది. అపుడు కొంతమందికి మాత్రమే పరిమితం చేయగా, ఇపుడు ఈ నిబంధనను తొలగించింది.
పలితంగా ప్రతి యూజర్ దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫేస్బుక్ మెసెంజర్లో యూజర్లు ఎవరైనా తాము అవతలి వారికి పంపిన మెసేజ్లను వెంటనే డిలీట్ చేయవచ్చు. అయితే అందుకుగాను 10 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఆ లోపలే మెసేజ్ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ లభిస్తున్నది.
