బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (14:41 IST)

ప్రచారంలో కేఏ పాల్ చైన్ కొట్టేశారు..

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ ఇతర రాజకీయ పార్టీలకు కొరకరాని కొయ్యగా మారాడు. తాజాగా వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన ఇతరులతో తన ప్రజాశాంతి పార్టీ టిక్కెట్‌పై నామినేషన్‌లు వేసేలా చేసి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు తన ఎన్నికల గుర్తు, జెండా కూడా వైసీపీని పోలి ఉండడంతో వారికి పాల్ ఇప్పుడు తలనొప్పిగా మారాడు. 
 
ఇప్పటివరకు అందరూ పాల్‌పై జోకరు ముద్ర వేసారు. అయితే సీన్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేసాడు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ.. తానే ఏపీకి కాబోయే మ్నుఖ్యమంత్రిని అంటూ పాల్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు అనుకోని సంఘటన ఎదురైంది. 
 
ఆయన గోల్డ్ చైన్ ఎవరో కొట్టేశారు. ప్రచారంలో భాగంగా ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతున్న తరుణంలో ఆయన వేసుకున్న దండలు తీసే ముసుగులో ఆయన చైన్ కూడా నొక్కేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేఏ పాల్ దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.