1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జూన్ 2022 (13:35 IST)

దేశ వ్యాప్తంగా 70 వెస్‌సైట్ల హ్యాక్.. సైబర నేరగాళ్ల అటాక్

cyber hackers
దేశ వ్యాప్తంగా దాదాపు 70కి పైగా వెబ్‌సైట్లపై సైబర్ నేరగాళ్లు దాడులకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. డ్రాగన్ ఫోర్స్, మలేషియా, 1877సంస్థ, కురుదేశ్ కోరల్స్ పేర్లతో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్, భవన్స్ స్కూల్‌కు చెందిన వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా, కొన్ని బ్యాంకింగ్ వెబ్‌సైటలు కూడా హ్యాక్ చేశారు. 
 
మరోవైపు, బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, నవీన్ జిందాల్‌లో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొని మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అంతర్జాతీయ ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెల్సిందే. ఈ పరిస్థితుల్లో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు చెందిన వెబ్‌సైట్లు హ్యాక్‌కు గురికావడం గమనార్హం.