శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 28 జూన్ 2019 (15:00 IST)

మొగుడితో ఒకరోజు శోభనం.. స్నేహితురాలితో భార్య జంప్... ఎందుకో తెలిస్తే షాకే...

చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టముండదు. ఎందుకంటే తాము బాగా ఇష్టపడే తమ సహచరులు ఎవరైనా ఉంటే వారితోనే కలిసి ఉండాలని అనుకుంటుంటారు. ఆడవారు ఆడవారిని ఇష్టపడినా, మగవారు మగవారిని ఇష్టపడినా జీవితాంతం కలిసే ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి ఘటనే రాజస్థాన్‌లో జరిగింది. 
 
రాజస్థాన్ షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక యువతిని మూడు వారాల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. వివాహమై శోభనం ముగిసింది. మరుసటి రోజు తెల్లవారుజామున నుంచి భార్య కనిపించలేదు. బంధువులు ఆమె కోసం ఎన్నో చోట్ల తిరిగారు. దొరకలేదు. చివరకు పోలీసులను ఆశ్రయించారు.
 
మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీని హర్యాణాలోని మనేసర్‌లో కనిపెట్టారు. అయితే పోలీసులే షాకవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది.  నేషనల్ ఛాంపియన్ అనే మరో యువతితో కలిసి సహజీవనం చేస్తోంది ఆ యువతి. విషయం తెలుసుకున్న బంధువులు అక్కడకు చేరుకున్నారు. వారితో రానని యువతి తేల్చి చెప్పింది. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును కోర్టు కొట్టేసింది. దీంతో ఇద్దరు యువతులు ప్రస్తుతం కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు.