1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 17 డిశెంబరు 2019 (16:35 IST)

లాలూ కొంపలో అత్తాకోడళ్ల గొడవ... కేంద్రంలో తిప్పారు కానీ ఇంట్లో తిప్పలేకపోతున్నారట

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిలో అత్తాకోడళ్ల మధ్య గొడవ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అత్త రబ్రీదేవి నన్ను వేధిస్తున్నారని, నా భర్త తేజ్ ప్రతాప్‌తో పాటు ఆడపడుచు మిసాభారతిలు నన్ను చిత్రహింసలు పెడుతున్నారని లాలూ ప్రసాద్ కోడలు ఐశ్వర్యరాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ముగ్గురూ కలిపి అదనపు కట్నం కోసం తనను నిత్యం అనేక చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త ఆడపడుచు నన్ను జుట్టుపట్టుకుని ఈడ్చారనీ, తన మొబైల్ ఫోన్ ఇతర విలువైన వస్తువులును లాక్కొని తనను బయటకు గెంటారని పోలీసులకు  తెలియజేసింది. 
 
ఇక లాలూ భార్య రబ్రీదేవి కూడా మా కోడలు పెడుతున్న భాధలకు అల్లాడుతున్నాం. ఆమె వేధింపులు భరించలేకున్నాం అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక లాలూ కొంపలో గొడవలు జరుగుతున్నాయి. మరి ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పిన లాలూ ఇంటి సమస్యల్లో ఎలా చక్రం తిప్పుతారో చూడాలి.