శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (14:38 IST)

కన్నతండ్రే కిరాతకుడు.. కన్నబిడ్డపై అత్యాచారం.. రోజూ 25 మందితో ..?

gang rape
కన్నతండ్రి కిరాతకుడిగా మారాడు. కూతుర్ని వ్యభిచార ఊబిలోకి దింపి.. తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాకుండా  రోజూ 25 మందితో కలిసి అత్యాచారానికి పాల్పడేవాడు. ఈ ఘటన బిహార్​ సమస్తిపుర్​లో జరిగింది.

ఇంకా బాధితురాలి తల్లి సైతం వారికే మద్దతు తెలిపింది. ఫిర్యాదు చేస్తానని పోలీస్​ స్టేషన్​కు వెళ్లగా.. వారు సైతం అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఈ అఘాయిత్యాలను భరించలేకపోయిన బాధితురాలు.. సెల్ఫీ వీడియో తీసి సోషల్ ​మీడియాలో పోస్ట్​ చేసింది. తనపై రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఇంట్లోనే బాధితురాలి తల్లి మద్యం విక్రయిస్తోంది. మద్యం తాగే వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేవారని.. తిరస్కరిస్తే కొట్టేవారని ఆ వీడియోలో తెలిపింది. ఈ విషయం మా నాన్న, మామకు చెబితే వారు సైతం అదే చేసేవారు. గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్​, ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళితే పోలీసులు అత్యాచారం చేశారు. మద్యం తాగి రోజుకు 20-25 మంది అత్యాచారానికి పాల్పడేవారు. నన్ను రక్షించండి లేకుంటే వారు చంపేస్తారు అంటూ బాధితురాలు చెప్పింది. 
 
ఈ ఘటనకు సంబంధించి వీడియో బయటకు రావడం వల్ల అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్టేట్​మెంట్​ తీసుకుని.. వైద్య పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీస్​ స్టేషన్ ఏఎస్సై మనోజ్​ కుమార్​ పైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ హృదయ్​కాంత్​ విచారణకు ఆదేశించారు.