శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (12:47 IST)

రజనీకాంత్‌కు బంపర్ ఆఫర్.. పార్టీలో చేరితే రాష్ట్ర పగ్గాలు ఆయనకే!

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. కొత్త పార్టీని స్థాపించే ఆలోచన విరమించుకోవాలని సలహా ఇచ్చారు. పైగా, తమ పార్టీలో చేరితే రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తామని చెప్పినట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
దేశంలో బీజేపీ హవా కొనసాగుతోంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో తమిళనాడునూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగానే రజనీకాంత్‌ సొంతంగా పార్టీ ప్రారంభించడం కంటే బీజేపీలో చేరితే పార్టీ పగ్గాలు అప్పగించడంతోపాటు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆఫర్‌ ఇచ్చినట్టు వెలువడుతున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 
 
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపట్టేలా ప్రధాని నరంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల్లోను డీఎంకే కూటమి దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ, పీఎంకే, టీఎంసీ, డీఎండీకే పార్టీలన్నీ ఘోరపరాజయాన్ని చవిచూశాయి. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై డీఎంకే మిత్రపక్షాలతో కలసి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాలనపై కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌‌ను తమవైపునకు తిప్పుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షాలను కృష్ణార్జునులతో పోల్చడం హాట్‌టాపిక్‌ అయ్యింది. రజనీకాంత్‌ బీజేపీకి దగ్గరవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.