శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (15:28 IST)

పెళ్లైనా ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు: హైకోర్టు సంచలన తీర్పు

వివాహం చేసుకుని భార్య ఉన్న కూడా మరొక మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని చట్టం చెబుతుంది. అయితే పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన యువతిని అతనితో కలిసి ఉండవచ్చు అంటూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఓ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌‌లు ఈ మేరకు సంచలన తీర్పునిచ్చారు.
 
మొయినుద్దీన్ అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పాల్ సోనీ అనే 26 ఏళ్ల యువతి అతడిని ప్రేమించింది. భార్యాపిల్లలు ఉన్న ఏ వ్యక్తితోనూ పెళ్లి చేయడానికి ఏ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఈ క్రమంలో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మొయినుద్దీన్ మరియు సోనీలు ఇంటర్ ఫెయిత్ (నమ్మకం) వివాహం చేసుకున్నారు. అలాగే ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు.
 
ఇది తెలుసుకున్న సోనీ తల్లిదండ్రులు ఆమెను హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో మొయినుద్దీన్ ఆమె కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసాడు. పోలీసులు సోనీని మార్చి 13వ తేదీన కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె భవిష్యత్తు, తదనంతర పరిణామాలను గురించి సోనీకి కౌన్సిలింగ్‌ని ఇప్పించినప్పటికీ, ఆమె మొయినుద్దీన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పింది. 
 
సోనీ మేజర్ కావడంతో ఆమెను మానసిక పరిపక్వత గల యువతిగా భావించిన న్యాయమూర్తులు సోనీ- మొయినుద్దీన్ కలిసి ఉండేలా సంచలన తీర్పునిచ్చారు.