1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (09:49 IST)

తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన కానిస్టేబుల్.. ఎక్కడ?

ఢిల్లీలో దారుణం జరిగింది. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ఓ కానిస్టేబుల్ అత్యంత కిరాతకంగా నడుచుకున్నాడు. తల్లిదండ్రులిద్దరినీ గొడ్డలితో నరికి ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖర్‌ఖైదా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ బిజేంద్ర సింగ్ వెల్లడిస్తూ,  కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో కనిపించాడని, అలాగే అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని తెలిపారు. 
 
వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. 
 
దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తర్వాత తాను విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ఈ హత్యలకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.