1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (10:14 IST)

ఎఫ్‌బీ పరిచయం.. నగ్నంగా వీడియో పంపి.. రూ.51వేలు పంపాలని డిమాండ్.. చివరికి?

ఢిల్లీ యువకుడిని సోషల్ మీడియా ద్వారా ఓ యువతి టార్గెట్ చేసింది. ఢిల్లీలోని నలసోపారా ఏరియాకు చెందిన 24 ఏళ్ల వ్యక్తిని ఆ యువతి ముంచేసింది. వివరాల్లోకి వెళితే.. నలసోపారాకు చెందిన 24 ఏళ్ల యువకుడు గౌరవ్... గౌరవంగా తన పని తాను చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ యువతి అతన్ని టార్గెట్ చేసింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు అతని మొబైల్ ట్రింగ్ మంది. ఏదో మెసేజ్ అనుకొని ఓపెన్ చేశాడు. 
 
ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్. ఎవరో అందమైన అమ్మాయి ఆ రిక్వెస్ట్ పంపింది. వెంటనే ఓకే చేసేశాడు. ఆ తర్వాత అతనితో చాటింగ్ మొదలుపెట్టింది. పరిచయాలు, పలకరింపులూ మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే బాగా దగ్గరైపోయింది. వాట్సాప్ నంబర్ అడిగింది. ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ మొదలైంది. మెల్లగా వీడియో చాట్ మొదలుపెట్టింది. ఫొటోల్లో కంటే... వీడియోలో ఇంకా అందంగా ఉందే అని అనుకున్నాడు.
 
ఓ రోజు రాత్రి వేళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. నిద్రపోవడం మానేసి... ఆమెతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. రెండ్రోజలు తర్వాత అతని వాట్సాప్ నంబర్‌కి అతని నగ్న వీడియోని పంపింది. తనకు రూ.51,00,000 పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆ వీడియోని అతని ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు, ఆఫీసులో ఉద్యోగులు అందరికీ పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. 
 
షాకైన అతను వెంటనే తులింజ్ పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. మార్చి 6, మార్చి 8న తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పాడు. ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సైబర్ సెల్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.