శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (18:09 IST)

నా తండ్రి పేరు కాదు.. మీ తండ్రుల పేరు పెట్టుకోండి.. రెబెల్స్‌కు సీఎం ఉద్ధవ్

uddhav Thackeray
తనపై తిరుగుబాటు చేసిన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వినియోగించడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి గౌహతిలో క్యాంపు శిబిరంలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలంతా కలిసి శనివారం కొత్త పార్టీని స్థాపించారు. దీనికి శివసేన బాలాసాహెబ్ అని పేరు పెట్టుకున్నారు. 
 
దీనిపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. తన తండ్రి పేరును వాడరాదన్నారు. మీ తండ్రుల పేరుతో పార్టీని స్థాపించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మీ తండ్రు పేరుతో ప్రచారం చేసుకుని గెలవాలని ఆయన సవాల్ విసురుతూ బాల్‌ ఠాక్రే పేరును వాడొద్దని హెచ్చరించారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు శివసేన జాతీయ కార్యవర్గం శనివారం మరోమారు సమావేశమైంది. ఇందులో పార్టీని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అధికారాన్ని కట్టబెట్టారు.