1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:12 IST)

ఈడీ ముందుకు జమ్మూ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా.. కాషాయ పార్టీని..?

omar
జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఈడీ ముందుకు వచ్చారు. ఈడీ ఆదేశాల మేర‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్ధుల్లా వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
జమ్మూ క‌శ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమ‌ర్ అబ్దుల్లాపై కూడా ఆరోప‌ణ‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒమ‌ర్ అబ్దుల్లాను విచారించినట్టు స‌మాచారం. 
 
ఈ వ్యవహారంలో తన వైపు నుండి ఎటువంటి తప్పు లేనందున సహకరిస్తానని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒమర్ అబ్ధుల్లా రాశారు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ నిలబడినా, కేంద్ర ఏజెన్సీలు తమపై అధికార "దుర్వినియోగం" చేస్తున్నాయని అన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం అలవాటు చేసుకుందని, అదే దిశలో ఇది మరో ముందడుగు అని ఒమర్ మండిపడ్డారు. 
 
బీజేపీకి అర్థవంతమైన వ్యతిరేకతను వ్యక్తం చేసే ఏ రాజకీయ పార్టీని కూడా వదిలిపెట్టలేదని, అది ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ అయినా సరే, ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని ఎన్సీ తన ప్రకటనలో పేర్కొంది.