1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:22 IST)

ఎట్టకేలకు 13 కాన్పుల తర్వాత వేసెక్టమీ ఆపరేషన్... ఎక్కడ?

operation
తమిళనాడులో దంపతుల జంటకు ఎట్టకేలకు 13 మందికి జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేయించేందుకు వైద్యాధికారులు మూడు రోజుల శ్రమించాల్సివచ్చింది. ఆ దంపతులకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని ఒప్పించి, భర్తకు వేసెక్టమీ ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాదైయ్యన్ (46), శాంతి (40) అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇప్పటికే 12 మందికి పిల్లలకు జన్మనిచ్చారు. మతపరమై సంప్రదాయం కారణంగా వీరిద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. గత వారం శాంతి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కాన్పుతో కలిపి మొత్తం 13 మంది పిల్లలు. 
 
ఈ కాన్పు తర్వాత శాంతి తీవ్రమైన రక్తహీనతకు గురైంది. మరో బిడ్డకు జన్మనివాల్సి వస్తే ఆ మహిళ చనిపోయే అవకాశం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కె.శాంతి కృష్ణన్ ఆ దంపతులకు వివరించారు. ఆమెతో పాటు వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులంతా కలిసి ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు కు.ని ఆరేషన్ చేయించుకునేందుకు సమ్మతించారు. దీంతో ఆదివారం ఈరోడ్ జిల్లా అందియూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాదైయ్యన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ చేశారు.