1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (09:01 IST)

కుమార్తె పాలిత కన్నతండ్రే కాలయముడు.. కరెంట్ షాక్‌తో చంపేశాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. కుమార్తె పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుమార్తెకు కరెంట్ షాక్‌ ఇచ్చి చంపేశాడు. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయిందంటూ నాటకమాడి, అందర్నీ నమ్మించి హుటాహుటిన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. చివరకు పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని కర్చన సమీప హిందూబేలా గ్రామవాసి లల్లన్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె చాందినీ రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెదికి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. 20 రోజుల క్రితం చాందినీ తన చెల్లి ఆసియాతో కలిసి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ముంబైలో ఉన్నట్లు తెలుసుకొని.. ఇంటికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో చాందినీ ఓ యువకుడితో ప్రేమలో ఉందని తండ్రికి తెలిసింది. దీన్ని జీర్ణించుకోలేని లల్లన్‌.. ఆమెను గదిలో బంధించి చితకబాదాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక చాందినీ ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్నకుమార్తె ఆసియాను తండ్రి బెదిరించాడు. విద్యుదాఘాతం సోకి చాందినీ చనిపోయిందని గ్రామస్థులను నమ్మించి శ్మశానంలో పూడ్చిపెట్టాడు. సోదరి మరణాన్ని జీర్ణించుకోలేని ఆసియా.. జరిగిన విషయాన్ని గ్రామస్థులకు చెప్పేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి లల్లన్‌ను అరెస్టు చేశారు.