శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (11:38 IST)

పుదుచ్చేరి జిప్మర్‌లో హైదరాబాద్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం..

రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన జిప్మర్‍‌లో ఏర్పాటుచేసిన ఓ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లి లైంగికదాడికి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాండిచ్చేరి పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిలో ఒకడు కామాంధ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మరొక నిందితుడు ఈ కానిస్టేబుల్ స్నేహితుడు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేశారు. 
 
జిప్మర్‌లో వారం రోజుల పాటు జరిగే ఓ సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి 20 యేళ్ల విద్యార్థిని వచ్చింది. ఈ విద్యార్థిని గురువారం రాత్రి ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియం ప్రాంగణంలో వాకింగ్ చేస్తూ కనిపించింది. 
 
ఆ సమయంలో బైకుపై వచ్చిన పుదుచ్చేరి కానిస్టేబుల్ కన్నన్ (31), ఆయన స్నేహితుడు శివలు కలిసి ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అమర్చివున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.