1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:55 IST)

సెప్టెంబర్ 12 నుంచి ఒడిశా, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Rains
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సెప్టెంబర్ 12 నుండి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం తెలిపింది. 
 
శని, ఆదివారాల్లో మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజుల్లో ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టవచ్చని వాతావరణ నిపుణులు తెలిపారు.
 
తూర్పు భారతదేశంలో, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వరకు చాలా విస్తృతమైన నుండి విస్తృతమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. 
 
సెప్టెంబర్ 11 వరకు కేరళ, కోస్తా, ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.