1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్‌లో తల్లిపాలు విక్రయిస్తే కఠిన చర్యలు!!

Milk
దేశ వ్యాప్తంగా తల్లిపాల విక్రయంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీచేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ చట్ట ప్రకారం దేశంలో తల్లిపాలను విక్రయించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 
 
నిజానికి శిశువులకు తల్లిపాలు ఎంత విలువైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శిశువులకు తల్లిపాల ద్వారానే వ్యాధి నిరోధక శక్తి అందుతుంది. అయితే, కొందరు తల్లులకు పాలు రాకపోవడం, కొందరు శిశువులకు తల్లిపాలు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వమే పాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఉచితంగా తల్లిపాలను అందిస్తోంది. అయితే, తల్లి పాలను విక్రయించడం చట్ట వ్యతిరేకమని, అలా ఎవరైనా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్-2006 యాక్ట్ ప్రకారం తల్లి పాల విక్రయానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
 
పాలిచ్చే తల్లుల నుంచి ప్రభుత్వమే పాలను సేకరించి, అవసరంలో ఉన్న చిన్నారులకు అందిస్తుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఆ మేరకు ప్రభుత్వం పాల బ్యాంకులు ఏర్పాటు చేసిందని వివరించింది. అయితే, కొందరు వ్యాపార దృక్పథంతో తల్లిపాలను విక్రయిస్తున్నారని, ఆన్‌లైన్‌లో ఇలాంటి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని ఇలాంటి అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని హెచ్చరించింది. అంతేకాదు, తల్లిపాల విక్రయానికి ప్రయత్నించే వ్యాపారులకు లైసెన్స్‌లు జారీ చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్దేశించింది.