శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:39 IST)

కోవిడ్ అయినా వదలరా? నర్సుపై హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం..

దేశంలో కరోనా వైరస్‌తో ప్రజలు నానా తంటాలు పడుతున్న వేళ.. కామాంధులు మాత్రం మారట్లేదు. కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారంటైన్‌ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడంతో కేరళలో సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆ హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.
 
ఈ నేపథ్యంలో ఆమె యాంటీజెన్‌ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గానే తేలింది. ఆ పరీక్షల ధ్రువీకరణపత్రాల్ని తన ఇంటికి వచ్చి తీసుకోవాల్సిందిగా ఆ వ్యక్తి ఆమెకు సూచించాడు. దీంతో సెప్టెంబర్‌ 3న ఆమె అతడి ఇంటికి వెళ్లగా సదరు వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, తర్వాతి రోజు వదిలిపెట్టినట్లు మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.