గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:41 IST)

విషపూరిత పాములను ఇట్టే పట్టుకునే సురేష్.. ప్రాణాల కోసం..?

విషపూరిత పాములను ఇట్టే చేతుల్లో బంధించే సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చిన్న వయసు నుంచే పాములను పట్టడంలో నేర్పరిగా మారిన సురేశ్.. పాములను పట్టుకుని అడవిలో వదిలి పెట్టాడు.

వివరాల్లోకి వెళితే.. జనావాసాల్లోకి పాము వచ్చిందని తెలియగానే వెళ్లి, దాన్ని అదుపు చేసే సురేశ్‌ను గతంలో ఎన్నో మార్లు పాములు కాటేశాయి. 
 
కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. తాజాగా, అత్యంత విషపూరితమైన రక్త పింజరి, సురేశ్‌ను కాటేసింది. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా, అది పని చేయలేదు.

ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటమే ఇందుకు కారణమని వైద్యులు తెలిపారు. మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు స్పష్టం చేశారు.