1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (08:17 IST)

ఒంటరిగా ఉన్న యువతి.. ఇంట్లోకి చొరబడి అత్యాచారం...

మహారాష్ట్రలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ముగ్గురు స్థానిక వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని బాంద్రా (వెస్ట్) జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాంద్రా వెస్ట్ జిల్లాలోని ఓ ప‌ట్ట‌ణంలో 19 ఏండ్ల యువ‌తిపై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో యువ‌తి ఒంటరిగా ఉన్న‌ద‌ని తెలిసి స్థానికంగా ఉండే ముగ్గురు వ్య‌క్తులు ఆ ఇంట్లో చొర‌బ‌డి దారుణానికి ఒడిగ‌ట్టారు. 
 
ఈ నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బాధిత‌ యువ‌తి త‌ల్లిదండ్రులతో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీ విధించింది.