1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (12:25 IST)

ముంబై మోడల్‌పై అత్యాచారం.. ఆ తర్వాత బెదిరింపులు.. ఎక్కడ?

victim
ముంబై మోడల్‌పై అత్యాచారం జరిగింది. ఆపై కామాంధుడు ఆమెను బ్లాక్ మెయిలింగ్ చేయసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేని మోడల్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్‌కు చెందిన బాధిత మోడల్ మోడలింగ్ వర్క్ షాపు కోసం రాంచీకి వచ్చింది. అక్కడ ఆమెకు తన్వీర్ ఖాన్ పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2021 నుంచి ఆమెతో ప్రేమగా నటిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పైగా, ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... తన్వీర్ ఖాన్‌ను అరారియా జిల్లాలో బుధవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఆరోపణలను తన్వీర్ ఖండించాడు. ఆమె తన ఏజెన్సీలో పనిచేసిందని, ఈ క్రమంలో నష్టపోయిన తాను పరిహారం అడగడంతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుందని ఓ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు.