సోమవారం, 6 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2025 (11:01 IST)

Man: ఢిల్లీ పట్టపగలే బంగారం దోపిడీ.. కోటి రూపాయలు గోవిందా

gold
దేశ రాజధాని ఢిల్లీలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలు నడిరోడ్డుపై ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలను
gold
షాపులో ఇచ్చేందుకు వెళ్తుండగా దారి కాచి మరీ వాటిని దోచేశారు దోపిడీ దొంగలు. దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే ఈ  దోపిడీ జరగడం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్‌ మండపం సమీపంలో కొందరు దొంగలు దారికాచి రూ. కోటి విలువ చేసే నగలను దోచుకెళ్లడం సంచలనంగా మారింది. 
 
ఢిల్లీకి చెందిన శివమ్‌కుమార్‌ యాదవ్‌, రాఘవ్‌ బంగారు ఆభరణాలను తయారు చేసి అవసరమైన షాపులకు సరాఫరా చేస్తుంటారు. ఎప్పటిలాగే నగలున్న బ్యాగులను తీసుకుని వారు తమ స్కూటర్‌పై చాందినీ చౌక్‌ నుంచి భైరాన్‌ మందిర్‌కు బయల్దేరినట్లు తెలిసింది. 
 
సమీపంలోని నగల దుకాణంలో వీటిని ఇచ్చేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు దుండుగులు బైక్‌పై వచ్చి వారిని అడ్డుకున్నారు. వెంటనే తేరుకున్న బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 
సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం వారు గాలింపు చేపట్టారు. కాగా బాధితుల నుంచి 500 గ్రాముల బంగారం, దాదాపు 35 కిలోల వెండి ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.కోటి పైనే ఉంటుందని తెలిపారు.