బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

శ్రద్ధను నేనే హత్య చేశా.. ఆ రోజున ఆ రంగు దుస్తులు ధరించివున్నది... అఫ్తాబ్

aftabpoonawala
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో కిరాతక ప్రేమికుడు అఫ్తాబ్ పూనావాలా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ నిందితుడికి జరిపిన నిజ నిర్ధారణ పరీక్షల్లో(నార్కో అనాలసిస్ టెస్ట్) నేరం చేసినట్టు చెప్పాడు. శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా ఎక్కడ దాచిపెట్టిందీ కూడా వెల్లడించారు. 
 
పైగా, శ్రద్ధను చంపినపుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉన్నది కూడా చెప్పాడు. పైగా, ఆమె వద్ద ఉన్న మొబైల్ ఫోన్ వివరాలను కూడా ఈ నిజ నిర్ధారణ పరీక్షల్లో వివరించాడు. ఆయనకు పాలీగ్రాఫ్, నార్కో అనాలసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్లేషించేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికీ తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. 
 
అంతకుముందు అఫ్తాబ్‌ ఉదయం 8.40 గంటల సమయంలో అధికారులు అఫ్తాబ్‌ను తీహార్ జైలు నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 10 గంటల వరకు నార్కో పరీక్ష నిర్వహించారు. ఆతర్వాత అతడిని పరిశీలనలో ఉంచారు. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫోటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆస్పత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గుప్తా తెలిపారు. అఫ్తాబ్‌కు నిర్వహించిన నార్కో పరీక్ష విజయవంతమైనట్టు అధికారులు తెలిపారు.