1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (09:39 IST)

హర్యానాలో ఘోరం.. గాయని హత్య.. కేవలం లోదుస్తులు మాత్రమే..?

హర్యానాలో ఘోరం జరిగింది. ఓ గాయని దారుణ హత్యకు గురైంది. 12 రోజుల క్రితం కనబడకుండా పోయిన ఆమె మృతదేహాన్ని దుండగులు రోహ్‌తక్ జిల్లాలోని భైరోన్ భైనీ అనే గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన పూడ్చిపెట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. మృతి చెందిన గాయని కుటుంబంతో కలిసి ఢిల్లీలో నివసిస్తోంది. ఈ నెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. ఓ మ్యూజిక్ వీడియో షూట్ నిమిత్తం రవి, రోహిత్ అనే ఇద్దరితో కలిసి ఆమె భీవని ప్రాంతానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
 
వాళ్లిద్దరే ఆమెను కిడ్నాప్ చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఆమె మృతదేహంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. 
 
మరోవైపు, ఈ హత్యపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు రోహ్‌తక్ జిల్లాలోని మేషం పట్టణంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. స్థానిక హోటల్లో ఆ గాయని రవి, రోహిత్‌లతో కలిసి డిన్నర్ చేసినట్లు అందులో స్పష్టంగా కనిపించింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది