శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (19:03 IST)

వీర్యం కోసం అలా కొట్లాడుకున్న మామ, కోడలు.. ఎక్కడ?

వీర్యం కోసం మామ, కోడలు కొట్లాడుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుది. వివరాల్లోకి వెళితే.. తలసేమియాతో బాధపడుతున్న ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఐతే మరణానికి ముందు తన వీర్యాన్ని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆస్పత్రిలో భద్రపరిచాడు. 
 
కొడుకు మరణం తర్వాత 2019లో అతడి తండ్రి ఆ ఆస్పత్రికి వెళ్లాడు. తన కుమారుడి వీర్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. ఐతే మీ కుమారుడికి ఇప్పటికే పెళ్లి అయినందున అతడి భార్య అంగీకారం కావాలని.. ఆమె అనుమతి ఉంటేనే ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది.
 
చేసేదేమీ లేకుండా.. అతడు కోడలి వద్దకు వెళ్లి అడిగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మామతో గొడవ జరిగిది దూరంగా ఉంది. అతడు చివరి ప్రయత్నంగా కోర్టుకు ఆశ్రయించాడు. మీరే న్యాయం చేయాలని.. నా కొడుకు వీర్యాన్ని నాకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. మృతుడి తండ్రి పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. 
 
మరణానికి ముందు వివాహ బంధంలో ఉన్నందున అతడి వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆస్పత్రి స్పెర్మ్ బ్యాంక్‌లో ఉన్న వీర్యం బాటిల్‌ను కేవలం భార్యకు మాత్రమే ఇవ్వాలని.. ఇంకెవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది.