1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:40 IST)

ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని.. నిండు గర్భవతిని..?

నిండు గర్భవతి అని కనికరం లేకుండా తల్లిదండ్రులు ఆమెను మట్టుబెట్టారు. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని తల్లిదండ్రులు ఆమెను కర్కశంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీ, ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 19ఏళ్ల యువతి రాహుల్ అనే యువకుడిని ప్రేమించింది. 
 
ప్రియుడి కోసం 2022 అక్టోబర్‌లో ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిపై కిడ్నాప్, రేప్ కేసులు పెట్టింది. దీంతో ప్రియుడిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు విచారణ కోర్టులో జరుగుతూ వుంది. అయితే తల్లిదండ్రుల వద్దకు రావడానికి ముందు కూతురు గర్భం దాల్చింది. 
 
అయినప్పటికీ రాహుల్‌కు శిక్ష పడాలని యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు. దీనికోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తమ కూతురుని పలుమార్లు బలవంతం చేశారు. దీని కోసం ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి నిరాకరించింది. దీంతో ఆవేశంతో ఆ తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గర్భిణీ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.