1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:58 IST)

లైఫ్ ‌స్టైల్ మారడం వల్లే వ్యాధులు : ప్రధాని నరేంద్ర మోడీ

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్

మారుతున్న సమాజంతో పాటు లైఫ్ స్టైల్ మారడం వల్లే వ్యాధులు వస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని ధర్మస్థల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు జీవితకాలం చివర్‌లో వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్నపిల్లలకు రావడం బాధ కలిగిస్తోందన్నారు. దీనికి లైఫ్ స్టైల్ మారడమే కారణమన్న మోడీ… వ్యాయామంపై దృష్టి పెట్టాలన్నారు. యంగ్ ఇండియాకు యోగా ఉపయోగపడుతుందన్నారు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను మోడీ అభినందించారు. 
 
అలాగే, వచ్చే 2022కల్లా ప్రతీ రైతు యూరియా వాడకాన్ని 50 శాతం తగ్గించుకునేలా పని చేయాలని ఆయన కోరారు. యూరియా వాడకం తగ్గిస్తే… దిగుబడిలో ఎలాంటి మార్పు ఉండదని… భూమి కూడా… సారం కోల్పోకుండా ఉంటుందన్నారు.