శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (19:04 IST)

కారుణ్య కోటాలో ఉద్యోగం కోసం... తండ్రిని చంపిన కొడుకు

కారుణ్య కోటలో ఉద్యోగం కోసం ఓ కన్నబిడ్డ తండ్రిని చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. కారుణ్య‌ కోటాలో ఉద్యోగం పొందేందుకు ఓ కొడుకు త‌ల‌పెట్ట‌రాని చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా రామ్‌ (55) అనే వ్య‌క్తి రామ్‌గ‌ర్ జిల్లాలోని బ‌ర్కక‌నాలో గ‌ల‌ సెంట్ర‌ల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌(సీసీఎల్‌)లో సెక్యురిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. కాగా ఇత‌ను గ‌డిచిన‌ గురువారం అనుమానాస్ప‌ద‌రీతిలో మృతిచెందిప‌డి ఉన్నాడు.
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వచ్చి సమాచారం సేకరించగా, గొంతు కోయ‌డంతో చ‌నిపోయిన‌ట్లుగా నిర్ధారించారు. ఈ విచార‌ణ‌లో కృష్ణారామ్ పెద్ద కొడుకు రామ్(35) హ‌త్య‌చేసిన‌ట్లుగా క‌నుగొన్నారు. చిన్న క‌త్తితో క్వార్ట‌ర్స్‌లోనే తండ్రి గొంతుకోసి చంపిన‌ట్లుగా తెలిపారు.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు హ‌త్య‌కు ఉప‌యోగించిన క‌త్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగి అయిన రామ్‌ కారుణ్య కోటాలో ఉద్యోగం పొందేందుకు తండ్రిని హ‌త‌మార్చిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.