గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (10:57 IST)

భార్య శవం ఫ్రిజ్‌లో.. భర్త మృతదేహం ఫ్యాన్‌కు... ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనామానాస్పదంగా మృతి చెందారు. వీరంతా అలహాబాద్‌‌లోని ధుమాన్‌గంజ్‌ చెందిన మనోజ్ కుష్వాహ(35) కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే, మనోజ్ కుష్వాహ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివశిస్తున్నాడు. అయితే, వీరి ఇంటి తలుపులు మూడు రోజులుగా తెరవకపోవడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే పోలీసులు రంగంలోకిదిగిగా ఇంట్లో ఐదు శవాలు కనిపించాయి. మనోజ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించాడు. అతడి భార్య మృతదేహం వేరే గదిలో ఉన్న ఫ్రిజ్‌లో, ఇద్దరు పిల్లల శవాలు సూట్‌కేసులో, మరో పాప శవం బీరువాలో లభించాయి. తన భార్యపై అనుమానంతోనే భార్యా పిల్లలను హత్య చేసి మనోజ్‌ ఈ ఘాతుకానికి పాల్పడివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.