1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఎద్దును ఢీకొని చొట్టపడిన వందే భారత్ రైలు

vande bharat
వందే భారత్ రైలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ రైలు. దేశంలో దీన్ని మించిన రైలు లేదంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, ఈ రైలు ఫిట్నెస్ ఇపుడు ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి ఎద్దును ఢీకొట్టడంతో వందే భారత్ రైలు చొట్టబడింది. ఓ ఎద్దు పట్టాలపైకి దూసుకుని రావడంతో దాన్ని వందే భారత్ రైలు ఢీకొట్టింటి. దీంతో రైలు ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన తర్వాత ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని కోల్వా - అరానియా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో రైలులోని ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ, రైలు ముందు భాగం మాత్రం బాగా చొట్టబడిపోయింది. ఈ ఘటన తర్వాత వందే భారత్ రైలు 15 నుంచి 20 నిమిషాల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత అధికారులు, రైల్వే సిబ్బంది వచ్చి ఎద్దును తొలగించిన తర్వాత తిరిగి బయుదేరింది.