1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మహిళ లగేజీలో 22 పాములు.. చెన్నై ఎయిర్‌పోర్టులో షాకింగ్ ఘటన

snake box
చెన్నై విమానాశ్రయంలో ఓ షాకింగ్ ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మహిళ ప్రయాణికురాలి లగేజీలో 22 పాములను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఆ మహిళ లగేజీని తనిఖీ చేస్తుండగా, 22 పాములతో పాటు ఓ ఊసరవెల్లి బయటపడింది. ఆ మహిళ మలేషియా నుంచి చెన్నైకి వచ్చింది. 
 
దీంతో నిందితురాలిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ పాములను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడిన పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు.