సంబంధిత వార్తలు
- 2023 నాటికి తెరుచుకోనున్న అయోధ్య రామాలయం తలుపులు
- మైనర్ బాలిక ప్రేమించింది.. తండ్రి కూడా ఒప్పుకున్నాడు.. ఐతే ఇంతలోనే..?
- అర్థరాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన మహిళ... వెనుకనే గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్
- హిమాచల్ప్రదేశ్లో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదు
- ఆర్థిక సాయాన్ని తిరస్కరించడంతోనే అత్యాచార ఆరోపణలు : టి సిరీస్ వివరణ
పారామిలటరీలో వీఆర్ఎస్లు అధికమే
దిల్లీ: కేంద్ర హోం శాఖ పరిధిలోని బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి ఆరు పారామిలటరీ దళాల్లో స్వచ్ఛంద పదవీ విరమణలు, రాజీనామాలు అధికంగానే ఉంటున్నాయి. ఇందుకుగల కారణాలపై ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేయించలేదు.
గత దశాబ్దం 2011-2020లో 81,007 మంది స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. 2017లో అత్యధికంగా 11,728 మంది వీఆర్ఎస్ తీసుకున్నారు. ఇదే సమయంలో 15,904 మంది రాజీనామా చేశారు. 2013లో వీరి సంఖ్య అధికంగా ఉంది. ఆ ఒక్క ఏడాదే 2,332 మంది ఉద్యోగాలను విడిచిపెట్టారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలు, ఉన్నత ఉద్యోగాలు లభించడం వంటివి ఇందుకు కారణాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.
బలగాల వారీగా పరిశీలిస్తే బీఎస్ఎఫ్ నుంచి రాజీనామాలు, వీఆర్ఎస్లు అధికంగా ఉంటున్నాయి. తరువాత స్థానంలో సీఆర్పీఎఫ్ ఉంది. ఈ రెంటింటితో పాటు సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్ను కూడా పారామిలటరీ దళాలుగా వ్యవహరిస్తుంటారు. వాటి బలగం దాదాపు పది లక్షల వరకు ఉంటుంది.
