1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ప్రమాదకర స్థాయిలో గంగా - యమున నదులు - నీట మునిగిన ఉత్తరభారతం

floods
ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఈ ప్రాంతంలోని అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా, గంగా, యమున నదులు ప్రమాకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో త్రివేణి సంగమమైన ఉత్తర్​ ప్రదేశ్​లోని ప్రయాగ్​ రాజ్​ నీట మునిగింది.
 
ఇరు నదులు ఉప్పొంగి ప్రవహించటం వల్ల ప్రయాగ్​రాజ్​లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దరగంజ్​, సలోరి, బఘద, రాజ్​పుర్​, నైనీ, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో మొదటి అంతస్తు నీటిలో మునగటం వల్ల పైఅంతస్తులో తలదాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
అనేక ప్రాంతాల్లోని వీధులన్ని నీట మునిగాయి. దీంతో వరద బాధితులను వీధుల నుంచి పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రయాగ్​రాజ్​లో గంగా నది 84.73 మీటర్ల మేర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరోవైపు యమునా నది నైనీలో 83.88 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో ఉత్తరభారత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.