మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (18:27 IST)

భర్తను భయపెట్టాలనుకుంది... కానీ నిప్పంటుకుని..?

భర్తను భయపెట్టాలనుకుంది. అంతే ఒంటిపై నూనె పోసుకుని నిప్పంటించుకుంటున్నట్లు నటించిన భార్యకు, నిజంగానే నిప్పంటుకున్న విషాదం చెన్నైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన అనితకు మదురవాయల్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో ప్రేమ వివాహం జరిగింది. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. 
 
వివాహం జరిగి ఏడాది అయ్యింది. వీరిద్దరూ మదురైవాయల్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వుంటున్నారు. అయితే కొద్ది నెలల నుంచి వినోద్ కుమార్ మద్యం సేవించడం ఇద్దరి మధ్య గొడవలకు దారితీసింది.
 
దీంతో భర్తను మార్చాలని.. మద్యం అలవాటుకు చెక్ పెట్టాలని భావించిన అనిత నూనె శరీరంపై పోసుకుని నిప్పంటించుకుని భర్తను భయపెట్టాలనుకుంది. కానీ నిజంగానే నిప్పంటుకోవడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.