1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (09:49 IST)

యూపీలో ఘోరం.. ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం..

rape
యూపీలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గోరఖ్ పూర్‌ ఆస్పత్రిలో ఒక యువకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళను పట్టుకుని బలవంతం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. సంత్ కబీర్ నగర్‌లో ఈ దారుణం జరిగింది. 22 ఏళ్ల యువతిని విచక్షణ రహితంగా కొట్టి, అత్యాచారం చేసి ఆమె ఇంటి ముందు వదిలేశాడు.
 
అపస్మారక స్థితిలో చేరుకుంది. దీంతో వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. 
 
కాగా, బాధితురాలు.. తనపై ప్రమోద్ చౌదరి అనే వ్యక్తి ఏప్రిల్ 9న తనపై అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా కొట్టాడని ఆమె పోలీసులు సెల్ ఫోన్ రికార్డులో తెలిపింది. దీంతో బాధితురాలు చికిత్స తీసుకుంటు సోమవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.