శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 7 డిశెంబరు 2020 (17:26 IST)

కంత్రీ భార్యాభర్తలు, తెలుగు విద్యార్థుల నుంచి 10 కోట్ల వసూలు, యుఎస్ నుంచి పరార్

అమెరికాలో హెచ్1 వీసాల పేరుతో తెలుగు విద్యార్థులను నట్టేట ముంచారు కిలాడీ జంట. అమెరికాలో చదువుకుంటున్న ఎఫ్ 1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్‌కి హెచ్ 1 వీసాలు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేశారు ముత్యాల సునీల్, ప్రణీత. 30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర సుమారు 10కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు.
 
అంటే ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లను వసూలు చేశారు. నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు 30 మంది తెలుగు విద్యార్థులు. ముత్యాల సునీల్, ప్రణీతలపై ఇంటర్‌పోల్ నోటీసులను జారీ చేశారు. దీంతో పరారయ్యారు సునీల్, ప్రణీతలు.
 
విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తండ్రి సత్యనారాయణ కూడా పరారీలో ఉన్నారట. వీరు యూరప్ పారిపోయినట్లు భావిస్తున్నారు. సునీల్ తండ్రి స్వస్థలం వెస్ట్ గోదావరి. తండ్రి కోసం పోలీసులు వస్తే ఆయన కూడా పరారీలో ఉన్నారట. 
 
హెచ్ 1 వీసాల కోసం ఎవరిని నమ్మొద్దు అంటున్నారు పోలీసలు. కన్సల్టెంట్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, దీన్నయినా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.