శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (23:08 IST)

బ్రహ్మముహూర్తం.. సకల కార్యసిద్ధికి సంకేతం.. దీపం వెలిగిస్తే? (video)

Deepam
పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం వెలిగించాలని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. సాధారణంగా కార్తీక, మార్గశిర మాసాల్లో ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. ప్రత్యేకించి మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తే పూర్వ పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది.
 
బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4.30 నుండి 6 గంటల వరకు. ఈ సమయంలో లేచి తలస్నానం చేసి పూజలు చేయడం ద్వారా వల్ల గొప్ప ఫలితాలు లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తం పూజలకు, హోమాలకు దోషం లేదు. ముహూర్తం అవసరం లేదు. ఇది భగవంతుని సమయము కాబట్టి ఆ సమయములో అపవిత్రత ఉండదు. 
 
బ్రహ్మ ముహూర్త సమయంలో దీపం వెలిగించి దేవతలను పూజిస్తే ఇంట్లో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. బియ్యం పిండితో ముగ్గులు వేసి ... తర్వాత బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు దీపం వెలిగించాలి.

సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు దీపం వెలిగించి పూజించాలి. ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో ఇంట్లో దీపం వెలిగించి శివ మంత్రాన్ని పఠించవచ్చు. ఇలా చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయి.