మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (11:09 IST)

ధనుర్మాసం ప్రత్యేకత.... ఈ మాసంలో విష్ణుపూజ చేస్తే..?

Lord Vishnu
ధనుర్మాసం ఈ రోజు ప్రారంభం అయ్యింది. ఈ మాసం శ్రీకృష్ణుని ఆరాధనకు శ్రేష్టమైనది. ఈ మాసం ధనుస్సు రాశికి చెందింది. ధనుర్మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని సలహా ఇస్తారు ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. 
 
ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ నెలలో ఆస్తుల కొనుగోలు, కొత్త గృహ ప్రవేశం, నిశ్చితార్థం, వివాహం వంటి ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఈ షరతులన్నీ మాసం పూర్తిగా భగవంతుని ఆరాధనకే అంకితం కావడానికి కావడమేనని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
 
ఈ మాసంలో విష్ణువును పూజిస్తే 1000 సంవత్సరాలు విష్ణువును భక్తితో పూజించిన ఫలితం దక్కుతుంది. విష్ణు భక్తులకు ఈ నెల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి వేలాది మంది భక్తులు విష్ణుపూజ చేస్తారు. 
 
ఇది శనితో సంబంధం ఉన్న మాసం. ధనుర్మాసం 2022-2023 డిసెంబర్ 16, 2022న ప్రారంభమై 14 జనవరి 2023న ముగుస్తుంది. అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది. ధనుర్మాసంలో తెల్లవారుజామున శ్రీమహావిష్ణువును పూజించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో విష్ణుసహస్రనామం పారాయణం చేస్తారు
 
ఈ నెల మొత్తం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాలు ముగించుకుని వేకువజామున పూజలు ప్రారంభించి, సూర్యోదయానికి ముందే పూజలను ముగిస్తారు. దీనిని ధనుర్ పూజ అని కూడా అంటారు. దేవతలకు దక్షిణాయనం రాత్రివేళ, ఉత్తరాయణం పగలు, అయితే ఈ ధనుర్మాసం రాత్రి, పగలు రెండూ కలగలిసి, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి, స్వామిని పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. .