1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జులై 2023 (23:40 IST)

నంది చెవిలో చెప్పే కోరికలు నెరవేరుతాయా? నందీశ్వరుడి మాట వినే శివుడు..

nandi awards
దేవాలయంలోని వ్యక్తులు శివుని వాహనం నంది చెవిలో చెప్పడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, పెద్ద కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే ఈ ఆచారం వెనుక గల కారణాలేంటంటని ఆరాతీస్తే.. శివుడు తపస్సులోనే వుంటాడు. ఆయన తపస్సుకు ఎప్పుడూ ఎలాంటి భంగం కలగకూడదు. 
 
అందుకే నంది ద్వారా మన సందేశాలను శివునికి తెలియజేస్తాము. నంది శివునికి ఎదురుగా వుంటాడు కాబట్టి.. ఆయన వద్ద మన కోరికలు తెలియజేస్తే.. ఆయన శివుని దృష్టికి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు. ఏ భక్తులు తమ సమస్యలతో శివుని వద్దకు వచ్చినా, నంది అక్కడ వారి కోరికలను విని శివునికి తెలియజేస్తాడనేది నిజం. ఈ విధానాన్ని భక్తులు నంది చెవిలో చెప్పే ప్రతి విషయం తప్పక జరుగుతుందని విశ్వసిస్తుంటారు. 
 
నందిని గొప్ప దూతగా భావిస్తారు
శివభక్తుల అభిప్రాయం ప్రకారం, నంది మాత్రమే ఎవరిపైనా వివక్ష చూపడని నమ్ముతారు. 64 కళలలో దిట్ట అయినప్పటికీ వినయంగా వుండే నందీశ్వరుడు తన స్పష్టమైన పదాలతో శివునికి సందేశాన్ని అందిస్తాడు. అందుకే అతన్ని శివుని దూత అని కూడా పిలుస్తారు. నంది శివునికి ప్రధాన గణం, అందుకే శివుడు కూడా అతని మాట వింటాడు. 
 
 
పురాణం అంటే ఏమిటి
ఒకసారి శివుడు తల్లి పార్వతితో ధ్యానం చేస్తున్నప్పుడు నంది కూడా ఆమెతో ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతను శివుని ముందు కూర్చుని తపస్సు చేస్తాడు, అందుకే నంది విగ్రహం ఎల్లప్పుడూ శివుని ముందు ఉంటుంది. ఒకప్పుడు జలంధరుడనే రాక్షసుడి నుండి తమను తాము రక్షించుకోవడానికి భక్తులందరూ శివుని వద్దకు వెళ్లారు. అతను తపస్సులో మునిగిపోయాడు. గణపతి కూడా శివునికి సందేశాన్ని తెలియజేయలేకపోయాడు.
 
ఆ సమయంలో గణపతి కూడా నంది ద్వారా శివునికి సందేశాన్ని అందించాడు. నంది ద్వారా శివునికి మన కోరికలు ఏవైనా చెప్పినట్లయితే, అది నెరవేరుతుందని నమ్ముతారు. మరోవైపు, శివుడితో పాటు నందిని పూజించకపోతే, శివుని పూజ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలాగే విఘ్నేశ్వరుడికి ఏదైనా కోరిక చెప్పాలంటే ఎలుకతో చెవిలో చెప్పే ఆచారం కూడా వుంది.