బ్యాడ్మింటన్ అకాడమీ కోసం రెండో సారి పూజ ఎందుకు..? ట్రోల్స్పై పీవీ సింధు ఏమన్నారంటే?
PV Sindhu
ఈ విమర్శలకు స్పందిస్తూ, సింధు ఎక్స్ వేదికగా ఒక వీడియోను పంచుకుని, ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించడానికి గల కారణాలను వివరించారు. మొదటి భూమి పూజ కేవలం ఏడు గంటల ముందు ఇచ్చిన సమాచారంతోనే జరిగిందని, దీనివల్ల తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తన సన్నిహితులు అనేకమంది హాజరుకావడం సాధ్యం కాలేదని సింధు తెలిపారు. ఆపై ఆ ప్రాజెక్ట్ స్వరూపంలోనే పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయని సింధు వెల్లడించారు.
"ఆ తర్వాత వెంటనే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు, కేవలం ఒక బ్యాడ్మింటన్ అకాడమీగా కాకుండా, సమగ్రమైన క్రీడా- విద్యా సంస్థగా దీనిని విస్తరించేందుకు మేము ప్రణాళికను మార్చుకున్నాం. దీంతో రెండవ భూమి పూజ విస్తరించిన ప్రాజెక్ట్కు ఒక కొత్త ఆరంభాన్ని సూచించింది. అలాగే, తన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారితో కలిసి ఈ మైలురాయిని జరుపుకునే అవకాశాన్ని ఇది కల్పించింది.
ఈ కలను మళ్లీ మొదలుపెడుతున్నప్పుడు, నాకు అత్యంత ఆప్తులైన వారు అక్కడ ఉండి, ఈ క్షణాన్ని కలిసి పంచుకోవాలని నేను కోరుకున్నాను. ఈ కొత్త ఆరంభంలో లోకేష్ అన్న మాతో కలవడం గౌరవంగా భావిస్తున్నాను," అని ఆమె వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను పూర్తి చేయడంపైనే పూర్తి దృష్టి సారించామని సింధు చెప్పారు. 2028కి దీనిని పూర్తి చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సింధు తెలిపారు. సింధు స్పందన సోషల్ మీడియాలో త్వరగా అందరి దృష్టిని ఆకర్షించింది. విమర్శలను నేరుగా ఎదుర్కోవడం, రెండవ భూమి పూజ వెనుక ఉన్న కారణాలను వివరించడం పట్ల చాలామంది ఆమెను ప్రశంసిస్తున్నారు.
