1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (10:58 IST)

నేడు హైదరాబాద్ నగరంలో సానియా మీర్జా చివరి మ్యాచ్

sania mirza
హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది. హైదరాబాద్ నగరంలో ఆమె ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతుంది. రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్‌, ‌బెథానీలతో కలిసి ఆమె ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సానియా అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నాయి. డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, మరియోన్ బర్తోలితో విమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతుంది.
 
ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌పై సానియా స్పందిస్తూ, "నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్ నగరంలో సొంత అభిమానులు, ప్రేక్షకుల ముందు ఆడి వారి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. నా కెరీర్ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం వ్యక్తిగతంగా నాకు గొప్పగా అనిపిస్తుంది. నా ఈ ప్రయాణం, అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను వారి కలలను నెరవేర్చుకోవాడనికి, లక్ష్యాలను సాధించుకోవడానికి కష్టపడి పనిచేసేలా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.