1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2022 (08:57 IST)

యాదగిరి గుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం

deadbody
తెలంగాణా రాష్ట్రంలోని యాదగిరిగుట్టలో శుక్రవారం రెండంతస్తుల భవనం బాల్కనీ కూలి నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. శ్రీరాంనగర్‌లో గుండ్లపల్లి దశరథ గౌడ్‌కు చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు మృతి చెందిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
 
భవనం అనేక దుకాణాలు మరియు నివాస భాగాలను కలిగి ఉంది. మృతులను దశరథగౌడ్, సీహెచ్ శ్రీనివాస్, అంగటి ఉపేందర్, శ్రీనాథ్‌లుగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.