1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (11:58 IST)

వాట్సాప్ మిస్డ్ కాల్ డిపీ చూసి 45 ఏళ్ల వివాహిత ప్రేమలో 25 ఏళ్ల యువకుడు, ఆ తర్వాత?

Love
వివాహిత ప్రేమ విషాదంతో ముగిసింది. హయత్‌నగర్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (45) భర్త, ఇద్దరు పిల్లలతో నివాసం వుంటోంది. సుమారు ఏడాదిన్నర క్రితం ఆమె నుంచి రాజేశ్‌ సెల్ ఫోనుకు మిస్డ్ కాల్ వచ్చింది. పరస్పరం పరిచయం ఏర్పడింది. 
 
ఆమె తనకు వివాహం కాలేదని చెప్పింది. దీంతో యువకుడికి కూడా వివాహం కాకపోవడంతో ఇద్దరూ చాటింగ్ చేశారు. వారి పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వాళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. 
 
ఆమె అతనిని కలిసిన ప్రతీసారీ వివాహిత అని విషయాన్ని దాచి పెట్టింది. దీంతో రాజేశ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమెకు పెళ్లైందనే విషయం రాజేష్‌కు తెలిసిపోయింది. దీంతో ఆమెను దూరం పెట్టాడు. ఈ బాధను ఆమె తట్టుకోలేకపోయింది. 
 
రాజేశ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించలేదు. దీంతో పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్య ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యవహారం సెల్ ఫోన్ ద్వారా తెలియవచ్చింది.
 
దీన్ని తెలుసుకున్న వివాహిత కుమారుడు రాజేశ్‌ను హెచ్చరించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.