1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BJP leaders meet Governor Tamilsai Soundararajan

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైను కలిసిన టీఎస్ బీజేపీ నేతలు

tamizhisai sounderrajan
తెలంగాణ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ నేతలు బుధవారం ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిశారు. ఇటీవల తెరాస నేతల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా రామయ్య పేటకు చెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్, అతని తల్లి ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. 
 
ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై గవర్నర్‌ జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. 
 
పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కేసుల దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు గవర్నర్‌ను అభ్యర్థించారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారని బీజేపీ నేతలు తెలిపారు. కాగా, తెలంగాణాలో అధికార తెరాస, బీజేపీల మధ్య అన్ని విధాలుగా ప్రచ్ఛన్నయుద్ధం సాగుతున్న విషయం తెల్సిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఏపీ సీఎం బర్త్ డే విషెస్