శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:10 IST)

చెల్లెలిపై అత్యాచారం.. పెద్దన్న కుమారుడు కూడా వదిలిపెట్టలేదు.. ఇద్దరూ కలిసి..?

చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తగూడెంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. చిన్నప్పుడే నాన్న వదిలివెళ్లడంతో అమ్మ, చెల్లెలి (20)తో కలిసి ఉంటున్నాడు. చెల్లిపై కన్నేసి ఆమెను లోబర్చుకొని.. శారీరకంగా హింసిస్తూ వచ్చాడు. 
 
అన్న అఘాయిత్యాల గురించి తల్లికి చెప్పినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు, తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడా ఆమె కొడుకు నరకం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు.. కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. 
 
గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు వాపోయింది. 
 
ఘటనకు సంబంధించి బాధితురాలి సోదరుడు, ఆమె తల్లి, పెద్దమ్మ భర్త, పెద్దమ్మ కుమారుడు, పెద్దమ్మలపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదుతో భయాందోళనకు గురైన అజయ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.