మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (16:53 IST)

కాంగ్రెస్ క్రియేటివిటీ.. కేసీఆర్, మోదీ, ఓవైసీ బొమ్మలాట...

Modi_KCR
Modi_KCR
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులను అవహేళన చేస్తూ వినూత్న హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. హైదరాబాదు నగరంలోని కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ క్రియేటివ్‌గా బొమ్మల బోర్డులను ప్రదర్శించింది.
 
తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీలా తారుమారు చేస్తూ ప్రధాని మోదీని ఓ కీలుబొమ్మగా చిత్రీకరిస్తూ ఆ బిల్‌బోర్డ్‌లు ఉన్నాయి. ఈ బొమ్మలాటల డిస్‌ప్లేలన హైటెక్ సిటీతో సహా ప్రధాన జంక్షన్లలో ఉంచారు. 
 
బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ, కాంగ్రెస్ నాయకులు నిరంతరం ర్యాలీలలో ఈ ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ బీఆర్ఎస్, ఎంఐఎంలను బీజేపీ బీ, సీ టీమ్‌లుగా ముద్రించారు.
 
వరుసగా మూడోసారి అధికారానికి పోటీపడుతున్న బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో ప్రత్యక్ష పోటీకి దిగింది. ఎంఐఎం, బీఆర్ఎస్ మద్దతు మిత్రపక్షం, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అధికార పార్టీకి మద్దతు ఇస్తూ, హైదరాబాద్ నగరంలోనే తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తోంది. 
 
బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ఇంతకుముందు బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ హోర్డింగ్‌ల వార్‌ని చూశారు. 
 
ఉపఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌, బీజేపీలు పరస్పరం పోస్టర్లు, హోర్డింగ్‌లు పెట్టుకున్నాయి. వాటిని తొలగించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలకు ధీటుగా కాంగ్రెస్‌ నేతల వంతు వచ్చింది.