1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (17:44 IST)

ఈ పెళ్లి ఎందరికో స్ఫూర్తి.. ఇకో ఫ్రెండ్లీ.. ఖర్చు రూ.55వేలు మాత్రమే!

తెలంగాణకు చెందిన ఓ పెళ్లి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఈ జంట ఇకో ఫ్రెండ్లీ వివాహం చేసుకోవడమే ఇందుకు కారణం. పర్యావరణకు అనుకూలంగా ఈ వివాహం జరిగింది. అలాగే వ్యర్థ రహిత సంఘాలను ప్రోత్సహించే ప్రచారంలో భాగంగా ఈ తెలంగాణ జంట వివాహాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. స్పూర్తి కొలిపాక, ప్రశాంత్ హైదరాబాద్‌లోని శామీర్‌పేట్‌లోని గ్రీన్ ఫామ్‌హౌస్‌లో పర్యావరణ పరిరక్షణ ఆలోచనకు మద్దతు ఇస్తూ వివాహం చేసుకున్నారు. శామీర్‌పేట ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈవెంట్‌ ధర సుమారు రూ.55 వేలే. ఆర్భాటాలు, వేడుకలు లేకుండా సాదాసీదాగా పెళ్లి చేసుకునేలా తమ స్నేహితులను, తల్లిదండ్రులను ఒప్పించారు. 
 
ఆహ్వానం కార్డులు లేదా ఏదైనా ప్లాస్టిక్ మెటీరియల్‌లను ఉపయోగించకుండా, వారు తమ అతిథులను పెళ్లికి ఆహ్వానించమని వాట్సాప్ సందేశాలు పంపారు. ఈ సందర్భంగా సేంద్రియ కూరగాయలతో ఆహారాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజలను ప్రేరేపించడానికి, స్పూర్తి కొలిపాక తన సాఫ్ట్‌వేర్ వృత్తిని విడిచిపెట్టి, ఒక సామాజిక సంస్థలో చేరారు.  ప్రస్తుతం ఈ జంటకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.