1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Government employee resigns in support of three capitals

మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా

Government employee
మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగి బసవరావ్ రాజీనామా చేశారు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
 
అమరావతి పేరుతో ఆనాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కున్నారని బసవరావ్ ఆరోపించారు. సీఎం జగన్ నిర్ణయానికి తాను మద్దతు తెలుపుతున్నానని అందుకే ఏపీలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
 
ఇంకా పదేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదులుకుంటున్నానని హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
తర్వాతి కథనం
అమ్మ అక్రమ సంబంధం, ముక్కుపచ్చలారని కుమార్తెకు నాన్న ఉరి, ఆపై అతడు కూడా...