తెలంగాణాలో కొత్తగా మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు అందిస్తున్నారు. గజ్వేల్ లోని మహతీ ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డుల పంపిణీ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, కొత్తగా 3,09,083 కార్డులను అందిస్తున్నామని, దీని కింద 8,65,430 లబ్ధిదారులున్నారని చెప్పారు. నెలకు అదనంగా 14 కోట్ల విలువగల 5,200 మెట్రిక్...