సంబంధిత వార్తలు
- ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులు బాదుడు, కరోనా వచ్చినా ఇంట్లోంచి కదలని తెలంగాణ పేషెంట్లు
- తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఎనిమిది మంది మృతి
- భారతదేశంలో క్రౌడ్ ఫండింగ్ విప్లవానికి ఏపీ, తెలంగాణ తోడ్పాటు: మిలాప్ సీఈవో మయూఖ్ చౌదరి
- కోక- కోలా ఇండియా సురక్షిత తాగునీటి ఏర్పాటు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 20,000 మందికి ప్రయోజనం
- మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డి ఆస్తుల విలువ రూ.50 కోట్లు!!
మందు బాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, క్లబ్బులకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పర్మిట్ రూమ్లకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అలాగే బార్లు, క్లబ్లలో మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్లకు అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ఆర్డర్ కాపీలో ప్రభుత్వం పేర్కొంది. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నది. దీంతో ఆరు నెలలు తర్వాత రాష్ట్రంలో మళ్లీ బార్లు, క్లబ్లు ఓపెన్ కానున్నాయి. ఇక కరోనాను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో మార్చి 22 నుంచి బార్లు కూడా మూతపడ్డాయి.
అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కోదానికి అనుమతి ఇస్తూ వస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలు రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోగా ఈ రోజు నుంచి హైదరాబాదు సిటీ బస్సులు కూడా మొదలయ్యాయి. ఇక తాజాగా బార్లు, క్లబ్లు ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది.
